Telangana

మహిళా సంఘాలకు బంపర్ న్యూస్.. 70% సబ్సిడీతో కొత్త ఆదాయ పథకం

కొత్త ఏడాది ప్రారంభంలో తెలంగాణ మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ మంచి వార్త చెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు’ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ పథకం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రతి నెలా స్థిర ఆదాయం పొందొచ్చు.

మహిళల సాధికారతను పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడం, రాష్ట్రంలో పాడి పరిశ్రమను బలోపేతం చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ పథకం కింద మహిళా సంఘాల సభ్యురాలికి రెండు పాడి గేదెలు లేదా ఆవులను అందించనున్నారు. ఈ కోసం యూనిట్ ధర రూ.2 లక్షలుగా నిర్ణయించబడింది. ఇందులో 70 శాతం మొత్తం రుసుము ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది.

ప్రారంభ దశలో ఈ ప్రాజెక్టును ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. అక్కడి ఫలితాల ఆధారంగా కొడంగల్ సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పాల కొరత తీవ్రంగా ఉంది. రోజుకు సుమారు 30 లక్షల లీటర్ల పాలు అవసరం, అయితే విజయ డెయిరీకి కేవలం 4 లక్షల లీటర్ల సరఫరా అందుతోంది. మిగతా పాలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించింది. అందులో భాగంగా, ఇందిరా డెయిరీ ప్రాజెక్టును వేగంగా అమలు చేయాలని నిర్ణయించింది.

పథకం అమలులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి మండలాన్ని మూడు జోన్‌లుగా విభజిస్తారు. పది గ్రామాలను ఒక యూనిట్‌గా ఏర్పాటుచేస్తారు. ఒక్కో మహిళా సంఘ సభ్యురాలికి రూ.2 లక్షల విలువైన రెండు పాడి పశువులను అందిస్తారు. ఇందులో రూ.1.40 లక్షలను ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది, మిగిలిన రూ.60 వేలను లబ్ధిదారుల వాటిగా బ్యాంకులు రుణంగా మంజూరు చేస్తాయి.

పశువులకు అవసరమైన దాణా, గడ్డి సరఫరా బాధ్యత స్థానిక యువతకు అప్పగించాలన్నది ప్రభుత్వ ఆలోచన. దీంతో వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పశువుల రవాణా కోసం ట్రాలీ ఆటోలను ఏర్పాటు చేయనున్నారు. పశువుల ఆరోగ్య సురక్షణకు ప్రతి నెలా వెటర్నరీ వైద్యులు తనిఖీలు నిర్వహించి ఆరోగ్య కార్డులు జారీ చేస్తారు. అంతేకాదు, పశువుల షెడ్లకు సౌర విద్యుత్ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

మొత్తంగా, ఇందిరా డెయిరీ ప్రాజెక్టు ద్వారా మహిళలకు ఆదాయం, రాష్ట్రానికి పాలు ఇమడించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

#IndiraDairyProgramme#WomenEmpowerment#RevanthSarkar#SelfHelpGroups#DairyDevelopment#TelanganaGovernment#PadiParishram
#RuralEmployment#MilkProduction#SHGWomen

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version