Sports

IND vs BAN 1st Test: రెండో రోజు ఆట ముగిసింది..

చెన్నై టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత క్రికెట్ జట్టు పూర్తిగా పట్టు బిగించింది. భారత్ చేసిన 376 పరుగులకు సమాధానంగా బంగ్లాదేశ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేయడంతో భారత్ మొత్తం ఆధిక్యం 308 పరుగులకు చేరుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రిషబ్ పంత్ 12 పరుగులతో, శుభ్‌మన్ గిల్ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్‌లో భారత ఇద్దరు స్టార్ బ్యాట్స్‌మెన్‌లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఫ్లాప్ అయ్యారు.

దీనికి ముందు, భారత జట్టు నిన్నటి స్కోరు 339/6 స్కోర్‌తో ఆటను ప్రారంభించింది. ఆ తర్వాత భారత జట్టు 376 పరుగుల తర్వాత ఔటైంది. రవిచంద్రన్ అశ్విన్ 113 పరుగులు, రవీంద్ర జడేజా 86 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. బంగ్లాదేశ్‌ తరపున హసన్‌ మహమూద్‌ అత్యధికంగా 5 వికెట్లు తీశాడు. అతనితో పాటు తస్కిన్ అహ్మద్ కూడా 3 వికెట్లు తీశాడు.

రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా టాప్ ఆర్డర్ మరోసారి ఫ్లాప్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ తక్కువ పరుగులకే ఔటయ్యారు. రోహిత్ శర్మ 5 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ ఇన్నింగ్స్‌లో 10 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ అవుటయ్యాడు. 17 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఔటయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version