Connect with us

Andhra Pradesh

ఏపీలో భారీ పెట్టుబడి: తిరుపతిలో రూ.1800 కోట్లతో PCB ప్లాంట్

Andhra Pradesh : దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్  .. ఏపీలో ఎక్కడ? ఏమిటా కంపనీ? | Syrma Sgs Technology Indias Largest  Electronics Plant To Come Up In Ap ...

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడికి మార్గం సుస్పష్టమైంది. దేశంలోనే అతిపెద్ద ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB) తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో నెలకొల్పేందుకు Syrma SGS Technology ముందుకు రావడంతో పరిశ్రమల రంగంలో కీలక అడుగు పడనుంది.

ఈ మేరకు టీడీపీ అధికారికంగా ట్వీట్ చేసింది. తిరుపతి జిల్లాలోని నాయుడుపేట వద్ద రూ.1800 కోట్ల వ్యయంతో ఈ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. 2027 మార్చిలోగా ఈ ప్లాంట్ పూర్తి స్థాయిలో పనిచేయనుందని పేర్కొంది.

గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించి ప్రభుత్వం తరఫున చర్చలు కొనసాగినట్టు టీడీపీ పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నిర్వహించిన చర్చలు సఫలమై ఈ భారీ పెట్టుబడి రాష్ట్రానికి లభించిందని పేర్కొంది.

ఈ ప్లాంట్ ఏర్పాటు వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని, నాయుడుపేట పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఇది మైలురాయిగా నిలవనుందని పరిశ్రమల వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి ఇది చక్కటి ఉదాహరణగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *