Connect with us

Business

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగింపు

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..  సెన్సెక్స్‌ 1400 పాయింట్లు పతనం

ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా IT రంగ షేర్లలో భారీగా అమ్మకాలు చోటు చేసుకోవడం సూచీలను దిగజార్చింది. BSE సెన్సెక్స్ 542 పాయింట్లు నష్టపడి 82,184 వద్ద ముగిసింది. NSE నిఫ్టీ కూడా 157 పాయింట్ల నష్టంతో 25,062 వద్ద స్థిరమైంది.

నెస్లే, శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, రిలయన్స్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా, బజాజ్ ఆటో షేర్లు నష్టపోయినవాటిలో ఉన్నాయి. మరోవైపు, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సిప్లా, సన్ ఫార్మా షేర్లు మాత్రం లాభాల్లో ముగిశాయి.

మొత్తంగా మార్కెట్ వెళ్తున్న దిశపై ఇన్వెస్టర్లలో అనిశ్చితి నెలకొంది. IT షేర్లలో అమ్మకాలు అధికంగా కనిపించడంతో సూచీలు ఒత్తిడిలోకి వచ్చాయి.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *