Andhra Pradesh
విశాఖలో కాగ్నిజెంట్ భారీ పెట్టుబడి
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరం త్వరలోనే ఐటీ రంగంలో కీలక కేంద్రంగా మారనుంది. ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ విశాఖలో ₹1,5822.98 కోట్ల విలువైన భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే కొన్నేళ్లలో సుమారు 8,000 ఉద్యోగ అవకాశాలు నెలకొననున్నాయి.
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖలోని కాపులుప్పాడలో కాగ్నిజెంట్కు 21.31 ఎకరాల భూమిని కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. ఈ భూమిని కేవలం 99 పైసల నామమాత్రపు లీజు ధరకు ఇవ్వనుండడం గమనార్హం. ప్రపంచ స్థాయిలో ఐటీ/ఐటీఈఎస్ క్యాంపస్ ఏర్పాటుకు ఇది దోహదపడనుంది.