Connect with us

india news

భారత్-కెనడా సంబంధాల్లో కొత్త అధ్యాయం: పాత వివాదాలకు స్వస్తి పలికిన ప్రధాని మార్క్ కార్నీ!

#భారత్_కెనడా  #మార్క్_కార్నీ  #దౌత్యసంబంధాలు  #ప్రధానిపర్యటన  #అంతర్జాతీయవార్తలు#మోదీ_కార్నీ #కెనడావార్తలు #విదేశీవిధానం  #భారతవిజయం#రాజకీయం  #వాణిజ్యం #తాజావార్తలు

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరన్న మాటను నిజం చేస్తూ, భారత్-కెనడా మధ్య మంచు కరుగుతోంది. గతంలో జస్టిన్ ట్రూడో హయాంలో ఇరు దేశాల మధ్య తలెత్తిన తీవ్ర విభేదాలను పక్కనపెట్టి, ప్రస్తుత కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్నేహ హస్తం అందించారు. తన తొలి భారత పర్యటనకు ముందే, భారత్‌పై గతంలో ఉన్న ఆరోపణలను కొట్టివేస్తూ ఆయన సానుకూల నిర్ణయం తీసుకున్నారు.

 2021 కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందన్న ఆరోపణలను ప్రస్తుత కెనడా ప్రభుత్వం అధికారికంగా ఉపసంహరించుకుంది.భారత అంతర్గత వ్యవహారాలపై గత ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను పక్కనపెట్టి, ప్రస్తుత యంత్రాంగం వాస్తవాలను గుర్తించింది.ఆర్థిక బంధం దెబ్బతిన్న వాణిజ్య సంబంధాలను మళ్ళీ పునరుద్ధరించడమే మార్క్ కార్నీ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం.ట్రూడో కాలంలో కనిష్ట స్థాయికి పడిపోయిన దౌత్య సంబంధాలు, ఇప్పుడు మార్క్ కార్నీ రాకతో మళ్లీ చిగురిస్తున్నాయి. “భారత్ మా ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకోలేదని మేము నమ్ముతున్నాం” అని కెనడా ఉన్నతాధికారులు స్పష్టం చేయడం విశేషం. ఖలిస్థానీ సానుభూతిపరుల అంశంపై గతంలో రేగిన అగ్గిని చల్లార్చి, భద్రత మరియు ఆర్థిక అంశాల్లో కలిసి నడిచేందుకు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. ఈ పర్యటనతో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో కొత్త సమీకరణాలు మొదలుకానున్నాయి.

 

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *