Connect with us

Latest Updates

తెలంగాణలో బీజేపీ ఎలా అధికారంలోకి వస్తుంది: రాజాసింగ్

బీజేపీతో రాజాసింగ్‌కు తెగిన బంధం! Great Andhra

హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీ భవిష్యత్‌ పరిస్థితులపై ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీకి సమగ్ర దృష్టి లేదని ఆయన వ్యాఖ్యానించారు. “బీజేపీ అధిష్ఠానం తెలంగాణపై అంతగా దృష్టి పెట్టడం లేదు. పెద్దలు చెప్పేది మాత్రమే ఢిల్లీ నేతలు నమ్ముతున్నారు” అని ఆయన అన్నారు.

రాజాసింగ్ విమర్శిస్తూ, పార్టీ కోసం సంవత్సరాలుగా కష్టపడుతున్న అసలైన కార్యకర్తలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. “ఏళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్తలు పట్టించుకోవడం లేదు. బదులుగా కొందరు నేతలు తమ మనుషులకే అవకాశాలు ఇస్తున్నారు. దీంతో అసలైన సైనికులు వెనుకబడిపోతున్నారు” అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక, ఈ తరహా పరిస్థితుల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నను రాజాసింగ్ లేవనెత్తారు. “అధికార పోరాటం చేయాలంటే కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వారిని ప్రోత్సహించాలి. కానీ ఇలాగే కొనసాగితే పార్టీకి పెద్ద నష్టం వాటిల్లుతుంది” అని స్పష్టం చేశారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *