Connect with us

Andhra Pradesh

వైఎస్ జగన్ ఆగ్రహం: టీడీపీ–జనసేన నేతలపై జైలు వ్యాఖ్యలతో రాజకీయం హాట్!

“చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్—ముగ్గురిపై చీటింగ్ కేసులు పెట్టి జైలుకు పంపాలి”

ఏపీ ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేలా అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. పలు కీలక అంశాలపై స్పందించిన ఆయన, కూటమి పాలనలో రాష్ట్రం పడుతున్న పరిస్థితులను ఎత్తిచూపుతూ “ఇది సేవ్ ఆంధ్రప్రదేశ్ అనాల్సిన సమయం వచ్చింది” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు.

కొత్త రూపంలో వ్యవసాయం గురించి జగన్ వ్యాఖ్యలు

జగన్ మాట్లాడుతూ—

“రాష్ట్ర జనాభాలో 42 శాతం మంది రైతు ఆదారంగా జీవిస్తున్నారు. పండగలా ఉండాల్సిన వ్యవసాయం, పాలకుల నిర్లక్ష్యంతో భారంగా మారిపోయింది. మొంథా తుపాను సమయంలో ప్రభుత్వ స్పందన పూర్తిగా అసమర్థతను బయటపెట్టింది. 15 లక్షల ఎకరాలు దెబ్బతిన్నప్పటికీ, 4 లక్షల ఎకరాలకే నష్టం జరిగినట్టు చూపించి రైతులకు పరిహారాన్ని అందించలేదు.

కూటమి 19 నెలల పాలనలో 17 సార్లు ప్రకృతి విపత్తులు వచ్చినా, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చే దిక్కూ లేదు. 1100 కోట్ల రూపాయల బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు. పంటల బీమా పథకాన్ని రద్దు చేసి, ప్రీమియం రైతులే చెల్లించాలని చెప్పి వారి మీద భారాన్ని మోపారు. దీంతో రైతులకు నష్టపరిహారం అందని దుస్థితి వచ్చి పడింది.

84 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుంటే, 19 లక్షల ఎకరాలకే బీమా వర్తిస్తుంది. రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధర ఏదీ లేని పరిస్థితి. అరటిపండ్లు కిలో అర్ధ రూపాయికీ అమ్ముకునే పరిస్థితి. దిత్వా తుపాను వచ్చే అవకాశం ఉన్నా, ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయకపోవడంతో రైతులు నష్టపోయారు. మా హయాంలో అనంతపురం నుంచి ఢిల్లీకే అరటి రైలు నడిపాం” అన్నారు.

అంతకుముందు ఆయన,

‘రైతన్నా మీకోసం’ అని అంటున్నా–ప్రాక్టికల్‌గా రైతులకు ఏ సహాయం జరిగింది? ఎప్పుడైనా చంద్రబాబు రైతుల పక్షాన నిలబడ్డారా? ప్రకటించిన సూపర్ సిక్స్‌లలో ఒక్కటి అయినా అమలైందా? నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, బీసీ/ఎస్సీ/ఎస్టీ/మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ –ఇవేవీ అమలు కాలేదు.

అన్నదాత సుఖీభవ పేరుతో సంవత్సరానికి 20 వేలు ఇస్తామన్నారు; ఇవ్వలేదు. ‘తల్లికి వందనం’ పథకంలో మొదటి ఏడాది మొత్తం తొలగించి, రెండో ఏడాది 20 లక్షల పిల్లలకు ఇవ్వలేదు. 15 వేలు అంటూనే 13 వేలే ఇచ్చారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నా, రెండేళ్లలో ఇచ్చింది రెండే మాత్రమే. అది కూడా అందరికీ కాదు. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ప్రచారం చేసినా, కొన్ని బస్సులు—కొంత మంది వరకే పరిమితం చేశారు. ఇది మోసం కాకపోతే మరేం?” అని ప్రశ్నించారు. చివరగా, “చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్–ముగ్గురిపై చీటింగ్ కేసులు పెట్టి జైలుకు పంపాలి” అని ఆయన విమర్శించారు.

#AndhraPradeshPolitics #YSJagan #APNews #APGovernment #PoliticalAttack #AgricultureIssues #FarmersVoice #JaganPressMeet #TDPVsYCP #APUpdates #SaveAndhraPradesh #YSRCP #PoliticalWar

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *