Connect with us

News

సోషల్ మీడియా ట్రోలింగ్ భరించలేక వ్యక్తి ఆత్మహత్య: కేరళలో విషాదం

కేరళలో సోషల్ మీడియా వేదికగా జరిగిన ఒక ప్రచారం ఒక వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక వ్యక్తి తనను వేధించాడని ఆరోపిస్తూ ఒక యువతి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు అతడిని దారుణంగా ట్రోల్ చేశారు. పరువు పోయిందన్న బాధతో ఆ 40 ఏళ్ల వ్యక్తి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పబ్లిసిటీ కోసమే ఆ యువతి తప్పుడు ఆరోపణలు చేసిందని, తమ కుమారుడు నిర్దోషి అని మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిజా నిజాలు తేలకముందే సోషల్ మీడియాలో తీర్పులు ఇచ్చే సంస్కృతి ఒక నిండు ప్రాణాన్ని తీసింది. కేరళకు చెందిన ఒక వ్యక్తిపై బస్సులో అసభ్య ప్రవర్తన ఆరోపణలు చేస్తూ ఒక మహిళ వీడియోను నెట్టింట వదిలింది. 20 లక్షలకు పైగా వ్యూస్ రావడంతో, నెటిజన్లు ఆ వ్యక్తి క్యారెక్టర్‌ను వేలెత్తి చూపారు.

సమాజంలో తలెత్తుకోలేక సదరు వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే, కేవలం వైరల్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఆ యువతి తన కొడుకుపై నిందలు వేసిందని మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా జరిగిన వ్యక్తిత్వ హననం ఒక వ్యక్తి ఆత్మహత్యకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. కోజికోడ్ జిల్లా గోవిందపురానికి చెందిన ఒక వ్యక్తి (40), కన్నూర్ నుంచి బస్సులో వస్తుండగా తనను ఇబ్బంది పెట్టాడని ఒక యువతి వీడియో రికార్డ్ చేసింది.

ఆ వీడియో క్షణాల్లో వైరల్ అవ్వడంతో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువతి చేసినవి తప్పుడు ఆరోపణలని, కేవలం పబ్లిసిటీ కోసమే అలా చేసిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.


Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *