Andhra Pradesh
వివాదాస్పద ప్లకార్డు ప్రదర్శన కేసు: రవితేజకు 14 రోజుల రిమాండ్
పల్నాడులో సీఎం జగన్ పర్యటన సందర్భంగా వివాదాస్పద ప్లకార్డును ప్రదర్శించిన యువకుడు రవితేజకు సత్తెనపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు అతడిని సత్తెనపల్లి సబ్ జైలుకు తరలించారు.
జగన్ రెంటపాళ్ల పర్యటనలో రవితేజ ఒక పుష్ప సినిమా డైలాగ్తో కూడిన ప్లకార్డు ప్రదర్శించగా, అది తీవ్ర వివాదానికి దారి తీసింది. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. విచారించిన న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ను విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Continue Reading