Connect with us

Entertainment

భారత్ అద్భుత పోరాటం.. ఇన్నింగ్స్ ఓటమిని తప్పించి మ్యాచ్‌ను డ్రాగా మలిచిన టీమ్ ఇండియా

Shubman Gill, KL Rahul Break 48-Year Record, Keep India Alive In 4th Test |  Cricket News

ఇంగ్లండ్‌తో జరిగిన నాల్గో టెస్టులో టీమ్ ఇండియా అద్భుతమైన పునరాగమనం చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. మొదటి ఇన్నింగ్సులో భారీ వెనుకబాటులో పడిపోయిన భారత్, రెండో ఇన్నింగ్సులో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఓటమి తప్పదని క్రికెట్ వర్గాలు అంచనా వేశాయి. అయితే, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని బ్యాటింగ్ యూనిట్ భారత అభిమానులకు ఆశలు నింపింది.

రెండో ఇన్నింగ్సులో Captain గిల్ అద్భుత సెంచరీతో మెరిశాడు. అతడికి జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు సహకరించడంతో భారత్ తిరిగి పుంజుకుంది. ఇద్దరూ అద్భుత శతకాలు సాధించి, ఇంగ్లండ్ బౌలర్లపై కౌంటర్ అటాక్‌ చేశారు. మరోవైపు ఓపెనర్ కేఎల్ రాహుల్ 90 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోరును సాధించగలిగింది. చివరకు 425/4 స్కోరు వద్ద భారత్ ఇన్నింగ్స్ ముగించగా, మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ఈ టెస్టు మ్యాచ్‌లో భారత్ మొదట 358 పరుగులకు ఆలౌటయ్యింది. ఇంగ్లండ్‌  669 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్సులో భారత్ మొదట 2 వికెట్లు త్వరగా కోల్పోయినప్పటికీ, మిగిలిన ఆటగాళ్లు గొప్ప పోరాటం చేసి మ్యాచ్‌ను నిలబెట్టారు. మ్యాచ్ డ్రాగా ముగియడం భారత అభిమానులకు ఊరటను ఇచ్చింది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *