Connect with us

International

‘ఆపరేషన్ సిందూర్’పై పార్లమెంటులో 16 గంటల చర్చ

ఆపరేషన్ సిందూర్ పై జూలై 29న పార్లమెంటులో చర్చ..

దేశ భద్రతా రంగంలో కీలకమైన అంశంగా మారిన ‘ఆపరేషన్ సిందూర్’పై ఈ నెల 28న లోక్సభలో ప్రత్యేక చర్చ జరగనుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ చర్చను ప్రారంభించనున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జై శంకర్, మంత్రులు అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దూబే తదితరులు చర్చలో పాల్గొననున్నారు. ఈ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకున్న కేంద్రం, దాని ప్రాధమిక విశ్లేషణ, విజయవంతత, దాని ద్వారా దేశ భద్రతపై కలిగిన ప్రభావం వంటి అంశాలపై లోక్సభలో వాస్తవాలను వివరించనుంది.

అలాగే జూలై 29న ఇదే అంశంపై రాజ్యసభలో కూడా చర్చ జరగనుంది. ఇరుసభల్లో ఈ అంశంపై సమగ్రంగా చర్చించేందుకు కేంద్రం మొత్తం 16 గంటల సమయాన్ని కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ చర్చల్లో పాల్గొననున్నట్టు సమాచారం అందింది. ఈ చర్చల ద్వారా ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతత, కేంద్రం తీసుకున్న సైనిక, మౌలిక చర్యలపై స్పష్టత చర్చించబోతోంది. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విధాన నిర్ణయాల్లో కీలక మలుపుగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *