Connect with us

Andhra Pradesh

నెల్లూరు: బస్సులో బంగారం ఉన్న ఒక బ్యాగ్.. ఆ తర్వాత రోజు..

ఓ మహిళ బంగారం ఉన్న బ్యాగ్‌ను పోగొట్టుకున్నారు. ఎక్కడ మర్చిపోయారో కూడా గుర్తులేదు.. ఇంతలో పోలీసుల నుంచి ఆమెకు కాల్ వచ్చింది. మీ బ్యాగ్ సురక్షితంగా ఉంది.. వచ్చి తీసుకెళ్లాలని పోలీసులు చెప్పగానే ఆమె ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే పోలీసుల్ని సంప్రదించి తన బ్యాగ్‌ను వెనక్కు తెచ్చుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఈ విషయం జరిగింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోయాక అసలు విషయం తెలిసింది.

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో ఇర్లపాడుకు చెందిన యానాదమ్మ హైదరాబాద్‌ నుంచి మర్రిపాడుకు వెళ్లారు. ఆమె ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సులో వెళ్తున్నారు. అదే బస్సులో నంద్యాలకు చెందిన శైలజ కూడా ఉంది. అయితే శైలజ తన బ్యాగును మరిచిపోయి బస్సు దిగింది. కొద్దిసేపటికి, యానాదమ్మ తన పక్క సీట్లో ఆ బ్యాగును చూసారు. ఆమె తీసి చూశాక అందులో బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయంటూ గుర్తించింది. వెంటనే ఆ బ్యాగును తీసుకెళ్లి పోలీసులకు అప్పగించింది.

బస్సులో మర్చిపోయిన బ్యాగులో మహిళ యొక్క వివరాలు ఉన్నందున, వెంటనే ఆమెకు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఆమె వెంటనే నంద్యాల నుంచి నెల్లూరు జిల్లా మర్రిపాడుకు వచ్చింది. అక్కడ పోలీసుల సమక్షంలో ఆభరణాలను తిరిగి ఇచ్చారు. ఆ బ్యాగ్‌లో 9 తులాల బంగారం మరియు వెండి ఆభరణాలు ఉన్నాయి. బంగారం, వెండి ఉన్న బ్యాగ్ దొరికిన వెంటనే పోలీసులకు తీసుకొచ్చిన ఇచ్చి మానవత్వం చాటుకున్న యానాదమ్మను మర్రిపాడు పోలీసులు అభినందించారు. ఆమె నిజాయితీని అందరూ ప్రశంసించారు. తన బ్యాగ్‌ను జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు శైలజ కూడా యానాదమ్మకు ధన్యవాదాలు తెలిపారు.

రెండు రోజుల క్రితం ఓ ఆర్టీసీ కండక్టర్ నిజాయితీని చూపించారు. ఓ మహిళ ఆర్టీసీ బస్సులో తన పర్సు మర్చిపోయి దిగారు. ఆ కండక్టర్ దాన్ని గమనించి, పర్సును తీసుకుని డిపో మేనేజర్‌కు అప్పగించారు.పర్సు పోగొట్టుకున్న మహిళకు సమాచారం ఇచ్చి పిలిపించారు. ఆమె పర్సును తిరిగి జాగ్రత్తగా అప్పగించారు. ఆ పర్సులో బంగారంతో పాటుగా డబ్బులు కూడా ఉన్నాయి.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *