Connect with us

Telangana

తల్లి కిడ్నీ ఇచ్చినా కూడా కుమారుడి ప్రాణం నిలవలేదు.. గుండె బద్ధలు చేసే సంఘటన!

తల్లి కిడ్నీ ఇచ్చినా కూడా కుమారుడి ప్రాణం నిలవలేదు.. గుండె బద్ధలు చేసే సంఘటన!

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని పుట్నూర్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల యువకుడు రాము కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కుమారుడిని ఎలాగైనా కాపాడుకోవాలని రాము తల్లి తన కిడ్నీని కొడుక్కి ఇచ్చి వైద్యం చేయించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. ఏడాది తర్వాత హైదారాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ రాము మృతిచెందాడు.

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. త‌న ప్రాణాన్ని ఫ‌ణంగా పెట్టిన ఓ తల్లి కుమారుడిని బతికించుకోవాలనుకున్నా ఫలితం లేకుండా పోయింది. కుమారుడికి కిడ్నీ దానం చేసినా ప్రాణం నిలవలేదు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళితే.. పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామానికి చెందిన లక్ష్మయ్య, సత్తెమ్మ దంపతుల కుమారుడు రాము.

అతడికి భార్య, తొమ్మిదేళ్ల కుమారుడు, అయిదేళ్ల కూతురు ఉన్నారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ సాఫీగా సాగిపోతున్న జీవితాన్ని కిడ్నీ వ్యాధి చెడగొట్టింది. రాము అనారోగ్యం బారిన పడటంతో ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షించిన డాక్టర్లు కిడ్నీ ఫెయిల్ అయినట్లు గుర్తించారు. డయాలసిస్‌తో కొంత ఉపశమనం వచ్చినా, కిడ్నీ మార్పిడి చేయించుకోవాలని డాక్టర్లు చెప్పారు. కుమారుడి అనారోగ్యాన్ని తట్టుకోలేకపోయిన ఆ తల్లి, కొడుకుతో పాటు తనకేమీ ఎక్కువ కాదని భావించింది. అతడి జీవితాన్ని నిలబెట్టేందుకు తన కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చింది.

తల్లి సత్తెమ్మ తన కుమారుడికి కిడ్నీనిదానం చేసింది. తల్లి కిడ్నీ ఇచ్చిన తర్వాత, రాము ఏడాది పాటు బాగానే ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఇన్‌ఫెక్షన్‌ కారణంగా రాము మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. ఆలస్యం చేయకుండా హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుండి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రాము, ఆరోగ్యం చెడు కాగా శుక్రవారం (నవంబర్ 15) మృతి చెందాడు. నాలుగేళ్ల క్రితం, రాము తండ్రి లక్ష్మయ్య కూడా మరణించారు. ఇప్పుడు ఏకైక కుమారుడు మృతి చెందటంతో సత్తెమ్మ గండెలవిసేలా రోధించారు. అది చూసిన స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వం, దాతలు సాయం చేయాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు యువకుడు మృతి ఇక హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. గాజులరామారం గ్రామానికి చెందిన కేసాని వెంకన్నస్వామి (30) మరియు వైజాగ్‌కి చెందిన పిల్లి దేవకుమారస్వామి (25) సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. గచ్చిబౌలిలో సినిమా చూసి గత అర్ధరాత్రి 2 గంటల సమయంలో హాస్టల్‌కు బయల్దేరారు. ట్రిపుల్‌ఐటీ జంక్షన్‌ నుంచి విప్రో జంక్షన్‌కి వెళ్ళే రహదారి మీద, ఒక్కసారిగా బైక్ అదుపు కోల్పొయి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

Loading