Connect with us

Andhra Pradesh

ఇవేం పాడు పనులురా.. అది లేడీస్ హాస్టల్ వెనుక..

రోజు రోజుకూ నేరగాళ్లు బరితెగిస్తున్నారు. అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా.. నేరస్థుల ఆగడాలు మాత్రం తగడ్డం లేదు. మరీ ముఖ్యంగా గంజాయి సాగు, అక్రమ రవాణా విషయంలో పోలీసుల తనిఖీలు, సోదాలు, దాడులను సైతం లెక్కచేయకుండా స్మగ్లర్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా అలాంటి ఉదంతమే విశాఖపట్నంలో వెలుగుచూసింది. గంజాయి, అక్రమ రవాణాను అరికట్టేందుకు విశాఖపట్నం పోలీసులు అనేక చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తూ.. విశాఖలోకి గంజాయి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా ఇన్ని జాగ్రత్తల నడుమ.. ఎలాగోలా స్మగ్రర్లు గంజాయి, రవాణా కోనసాగిస్తున్నారు. అయితే ఈసారి ఏకంగా విశాఖపట్నంలోనే గంజాయి సాగు చేస్తున్న వైనం కలకలం రేపింది.

విశాఖపట్నంలో గంజాయి సాగు చేయడం కలకలం రేపింది. వైజాగ్‌లోని కేజీహెచ్ లేడీస్ హాస్టల్ వెనుక ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్న వైనం బయటపడింది.గంజాయి మత్తుకు అలవాటుపడిన కొంతమంది యువకులు.. గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ గంజాయి పంట పండిస్తున్నట్లు తెలిసింది. గత రెండేళ్లుగా ఇదే యవ్వారం జరుగుతున్నట్లు సమాచారం. అయితే పక్కా సమాచారంతో పోలీసులు ఈ గుట్టును రట్టుచేశారు. వచ్చిన సమాచారం ఆధారంగా దాడి చేసిన విశాఖపట్నం పోలీసులు.. గంజాయి సాగుచేస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడ పండించే గంజాయిని విశాఖపట్నంలోని కాలేజీ విద్యార్థులకు కూడా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

మొత్తం ఐదు మంది యువకులు ఈ గంజాయిని సాగుచేస్తున్నట్లు విశాఖపట్నం పోలీసులు తెలిపారు. ఏజెన్సీ నుంచి తీసుకువచ్చి ఇక్కడ పండిస్తున్నట్లు వెల్లడించారు. ఐదుమందిలో ఒక మైనర్ ఉండగా.. మిగతా నలుగురు కూడా మైనర్లు కావటం పోలీసులను షాక్‌కు గురిచేసింది. నిందితుల్లో ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఇక పట్టుబడిన వారి నుంచి గంజాయిని ఎవరెవరికి విక్రయిస్తున్నారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో వీళ్లు మాత్రమే ఉన్నారా.. లేక ఇంకా వేరే వ్యక్తుల కూడా ఉన్నారా అనేదానిపైనా ఆరా తీస్తున్నారు. గంజాయి మత్తుకు బానిసలు కావద్దని.. ఇలా అక్రమంగా సాగు, రవాణా చేస్తే జీవితాలు నాశనమవుతాయని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తునే ఉన్నారు.

Loading