International
IND vs PAK మ్యాచ్ నుంచి EaseMyTrip వెనక్కు – దేశభక్తి ముందే అన్న స్పాన్సర్ సంస్థ
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో జరిగే భారత vs పాకిస్తాన్ సెమీఫైనల్ మ్యాచ్కుEaseMyTrip సంస్థ అనుబంధాన్ని విరమించుకుంది. ఈ సంస్థ ఈ టోర్నమెంట్కి టాప్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్నప్పటికీ, పాకిస్తాన్ జట్టు పాల్గొనబోయే మ్యాచ్కు స్పాన్సర్గా ఉండకూడదని స్పష్టంగా నిర్ణయం తీసుకుంది. ఈ చర్యతో టోర్నీ నిర్వాహకులు షాక్కి గురయ్యారు.
EaseMyTrip సంస్థ సహ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టీ ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను వివరించారు. “టెర్రరిజం మరియు క్రికెట్ కలిసి పోవు. ఇటీవల జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్తాన్ పాల్గొంటున్న ఏ మ్యాచ్నూ మేము మద్దతు ఇవ్వడం సరైందేమీ కాదు. దేశ భద్రత కంటే, జాతీయ భావన కంటే వ్యాపారం ముఖ్యమయ్యే పరిస్థితి రావద్దు,” అంటూ ఆయన స్పష్టంగా వ్యాఖ్యానించారు.
ఈ ప్రకటనతో EaseMyTrip సంస్థ దేశభక్తిని ప్రదర్శించిందని పలువురు అభినందిస్తున్నారు. క్రీడలకూ, వ్యాపారానికీ మించిన అంశాలు ఉన్నాయన్న విషయాన్ని సంస్థ ఈ నిర్ణయం ద్వారా ఆవిష్కరించింది. ఇదే సమయంలో, ఇలాంటి జట్ల మధ్య జరిగిన మ్యాచ్లు సామరస్యానికి దారి తీయాలని కొంతమంది భావిస్తున్నా, ఉగ్రవాదం దెబ్బతీసిన నేపథ్యంలో, ఈ నిర్ణయం సమయోచితమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.