Latest Updates
3,883 ఖాళీలు.. 10th క్లాస్, ITI అర్హత.. రాత పరీక్ష లేకుండా ఎంపిక.. ప్రభుత్వ సంస్థ Yantra India లిమిటెడ్

ప్రభుత్వ సంస్థ Yantra India లిమిటెడ్లో 3,883 ఖాళీలు ఉన్నాయి. 10th క్లాస్, ITI అర్హత కలిగిన వారికి అవకాశం ఉంది. రాత పరీక్ష లేకుండా ఎంపిక జరుగుతుంది.
భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నాగ్పుర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్ భారీ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాల్లోకెళ్తే..
భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే యంత్ర ఇండియా లిమిటెడ్, నాగ్పుర్ ప్రధాన కేంద్రంగా భారీ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆర్డ్నెన్స్, ఆర్డ్నెన్స్ ఎక్విప్మెంట్ ఫ్యాక్టరీల్లో ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా ఐటీఐ, నాన్ ఐటీఐ అభ్యర్థులకు సంబంధించి మొత్తం 3,883 ఖాళీలు ఉండగా.. వీటన్నింటినీ అర్హులైన అభ్యర్ధుల ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో ఐటీఐకు సంబంధించి 2498 ఖాళీలు ఉన్నాయి. అలాగే, నాన్ ITIకి సంబంధించి 1,385 ఖాళీలు ఉన్నాయి.
అర్హత మరియు ఆసక్తి ఉన్న వారు నవంబర్ 21వ తేదీకి ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని యంత్ర ఇండియా ప్రకటించింది. ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం విద్యార్హతల ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ చూడొచ్చు. అలాగే.. అప్లయ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి.
ఆర్డినెన్స్ కేబుల్ ఫ్యాక్టరీ– చండీగఢ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ– నలంద, గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ– జబల్పూర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ– ఇటార్సీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ– ఖమారియా, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ– కట్ని, హై ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీ– కిర్కీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ– అంబఝరి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్– అంబర్నాథ్ మరియు ఇతర ఫ్యాక్టరీల్లో మొత్తం ఈ అప్రెంటీస్ ఖాళీలు భర్తీ చేస్తారు.
ఖాళీలున్న ట్రేడులు– అర్హతలు ఇవే:
మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మేసన్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, బాయిలర్ అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ తదితర ట్రేడుల్లో అప్రెంటీస్లను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే సంబంధిత ఐటీఐ కేటగిరీలో ఉత్తీర్ణతతోపాటు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతిలో పాసై ఉండాలి. నాన్–ఐటీఐ కేటగిరీకికి సంబంధించి అభ్యర్థులు 50 శాతం మార్కులతో పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
నోటిఫికేషన్
ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్లో నవంబర్ 21వ తేదీకి ముందు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్ అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించాలి. నాన్–ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐ కేటగిరీకి 10వ తరగతి మరియు ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
ఎంపికైన వారికి నెలకు నాన్–ఐటీఐలకు రూ.6000, ఐటీఐలకు రూ.7000 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు.