Andhra Pradesh

తిరుమల లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్.. ప్రకాష్ రాజ్..

తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద పవన్ కళ్యాణ్ ముందు నుంచి ఎంతగా పోరాడుతున్నాడో అందరికీ తెలిసిందే. ఆయన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష కూడా తీసుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద సీరియస్ అయ్యారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం కేంద్ర స్థాయిలో ఓ సంస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఇక ఈ లడ్డూ విషయంలో ఇలా పవన్ కళ్యాణ్ వేసిన ట్వీట్, మాట్లాడిన మాటలపై ప్రకాష్ రాజ్ కౌంటర్లు వేశారు. తిరుపతి లడ్డూ వివాదం మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే జరిగింది.. దోషుల్ని పట్టుకోండి.. జాతీయ స్థాయిలో చర్చలెందుకు లేవనెత్తుతున్నారు అంటూ కౌంటర్ వేశాడు.

ప్రకాష్ రాజ్ మాటలపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. హిందువుల గురించి మాట్లాడకూడదా? అన్యాయం జరిగితే ప్రశ్నించకూడదా? సెక్యులరిజం అంటే టూ వే.. నాట్ వన్ వే అంటూ ప్రకాష్ రాజ్‌కు కౌంటర్ వేశాడు. అలా హీరో కార్తీపైనా పవన్ కళ్యాణ్ మండిపడ్డాడు. లడ్డూని జోక్‌గా తీసుకోకండని వార్నింగ్ ఇస్తే.. కార్తీ సారీ కూడా చెప్పాడు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా కూల్‌గా రియాక్ట్ అయి సినిమా టీంకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

అయితే ఇలా కార్తీతో సారీ చెప్పించుకోవడం ఏంటో.. చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడం ఏంటో అని మళ్లీ ప్రకాష్ రాజ్ కౌంటర్ వేశాడు. ప్రకాష్ రాజ్ రియాక్షన్స్ ఇలా ఉంటే.. ఆయన స్నేహితుడు డైరెక్టర్ కృష్ణవంశీ మాత్రం ఎంతో సౌమ్యంగా స్పందించాడు. పవన్ కళ్యాణ్ చాలా గొప్పవాడు అని.. ఆయనంటే నాకు చాలా ఇష్టమని.. కుళ్లిపోయిన ఈ రాజకీయాల్లో ఓ వ్యక్తి వచ్చి మార్చే ప్రయత్నం చేస్తున్నాడని, ఆ దేవుడు ఎప్పుడూ అతని వెంట తోడుగా ఉండాలని ట్వీట్ వేశాడు.

ఆ తరువాత మరో అభిమాని వేసిన కామెంట్‌కు కృష్ణవంశీ స్పందించాడు. నిజం ఎప్పుడూ నిజమే.. దాన్ని ఎవ్వడూ గుర్తించాల్సిన పని లేదు.. పీకే రియల్ లైఫ్ హీరో.. మళ్లీ మళ్లీ నిరూపిస్తూనే ఉన్నారు.. ఇలాంటి రాజకీయ నాయకులే మనకు కావాలి.. యోగి ఆదిత్య నాథ్ తరువాత మళ్లీ పవన్ కళ్యాణ్‌ను చూస్తే హోప్ కలుగుతోంది అంటూ కృష్ణవంశీ అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version