Andhra Pradesh
నెల్లూరులో గోల్డెన్మెన్.. ఒంటి నిండా బంగారమే..
నెల్లూరులో గోల్డ్మెన్ సందడి చేశారు.. ఒంటి నిండా బంగారంతో నగరంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన్ను చూసేందుకు.. సెల్ఫీలు దిగేందుకు జనాలు పోటీపడ్డారు. కర్ణాటకకు చెందిన గోల్డ్మెన్ రిజమూన్ నెల్లూరు వచ్చారు. ఆయన ఒంటిపై ఏకంగా 2 కిలోలకుపైగా బంగారంతో కనిపించారు. రిజమూన్ కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో 31 ఏళ్లుగా స్థిరపడ్డారు. ఆయనకు అక్కడ 30 ఎకరాల కాఫీ ఎస్టేట్ ఉంది.. రెడ్లన్స్ కంపెనీ రీజినల్ మేనేజర్గా ఆరు రాష్ట్రాలు చూస్తున్నారు.
తనకు ఐదు భాషలు వచ్చని.. తెలుగు కూడా త్వరలో నేర్చుకుంటానని చెబుతున్నారు రిజమూన్. సింగర్ హనిసింగ్ బంగారు వాచ్, బ్రాస్లెట్లు, చైన్లు వేసుకుని ముంబైలో పాటలు పాడుతారని.. ఆయన్న చూసి 2010 నుంచి బంగారంపై తనకు ఆసక్తి పెరిగిందన్నారు. ఎప్పటికైనా తన ఒంటిపై 5 కిలోల బంగారం వేసుకోవాలనే లక్ష్యం ఉందన్నారు. తాను నెల్లూరులో ఓ డీలర్ను కలిసేందుకు వచ్చానని చెప్పారు. మరోవైపు రిజమూన్ను చూసినవార సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. మొత్తం మీద ఈ కర్ణాటక గోల్డ్మెన్ నెల్లూరులో సందడి చేశారు.
![]()
