Connect with us

movies

మరోసారి ఐటెమ్ గర్ల్‌గా మారిన బుట్టబొమ్మ.. ఏకంగా రూ.5కోట్ల రెమ్యునరేషన్!

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన పూజా హెగ్డే, ఇటీవల వరుస ఫ్లాప్‌లతో కొంత వెనుకడుగు వేసినా, ఆమె స్టార్ ఇమేజ్, గ్లామర్ అస్సలు తగ్గలేదు. తాజాగా ఆమె తీసుకున్న సంచలన నిర్ణయం ‘స్పెషల్ సాంగ్స్’ ద్వారా మళ్లీ ట్రెండ్‌సెట్టర్‌గా మారింది.

రజనీకాంత్ గారి ‘కూలీ’ చిత్రంలోని ‘మౌనిక’ పాట పూజా హెగ్డే స్టైల్, డ్యాన్స్, గ్లామర్ మరోసారి ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఈ పాట సౌత్ అంతటా వైరల్ కావడంతో, పూజా హెగ్డేకు ప్రత్యేక గీతాల ఆఫర్లు ఒక్కసారిగా పెరిగాయి.

తాజా సమాచారం ప్రకారం, మెగాస్టార్ హీరో అల్లు అర్జున్ – డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రంలోని ఒక స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డేను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ స్పెషల్ గీతం కోసం ఆమెకు ఏకంగా సుమారు ₹5 కోట్లు పారితోషికం ఆఫర్ చేసినట్లు టాలీవుడ్ టాక్. ఐటెం సాంగ్‌కు ఒక స్టార్ హీరోయిన్‌కు ఇంత భారీ రెమ్యునరేషన్ ఇవ్వడం అరుదు. ఇది ఇప్పటికీ పూజా హెగ్డే మార్కెట్ ఎంత బలంగా ఉందో స్పష్టం చేస్తోంది.

ఒకానొక దశలో తెలుగు చిత్ర పరిశ్రమలోని అల్లు అర్జున్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి అగ్రనటులందరి సరసన నటించిన ఏకైక హీరోయిన్‌గా పూజా హెగ్డే నిలిచింది. ఆమె అందం, గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి.

సినిమాల విషయంలో కెరీర్ కాస్త డల్ అయినప్పటికీ, ఫ్లాప్‌లకు భయపడకుండా, స్పెషల్ సాంగ్స్ రూపంలో తన స్టార్ ప్రెజెన్స్‌ను కొనసాగించాలని ఆమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సక్సెస్ అయింది. ఈ కొత్త ప్రయాణం ఆమె కెరీర్‌కు మరో కీలక మలుపు అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సినిమాలతో పాటు, సోషల్ మీడియాలోనూ పూజా హెగ్డే ఎప్పుడూ తన అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. తాజాగా డిసెంబర్ నెలను స్వాగతిస్తూ ఆమె షేర్ చేసిన స్టైలిష్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *