Health
దేశంలో కరోనా కేసుల భారీ పెరుగుదల: 24 గంటల్లో వెయ్యికి పైగా కొత్త కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో సుమారు వెయ్యి కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, నిన్న దేశవ్యాప్తంగా 1,828 యాక్టివ్ కేసులు ఉండగా, తాజా లెక్కల ప్రకారం ఈ సంఖ్య 2,710కి చేరుకుంది. రాష్ట్రాల వారీగా చూస్తే, కేరళలో అత్యధికంగా 1,147 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 494, గుజరాత్లో 223 కేసులు రిపోర్ట్ అయ్యాయి.
గడిచిన 24 గంటల్లో కరోనాతో ఏడుగురు మరణించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ, ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమై, పరిస్థితిని సమీక్షిస్తోంది.