Connect with us

Andhra Pradesh

బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు విశాఖపంట్నంలో బ్యాడ్మింటన్ అకాడమీ కోసం భూమి పూజచేశారు

బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు విశాఖపంట్నంలో బ్యాడ్మింటన్ అకాడమీ కోసం భూమి పూజచేశారు

విశాఖపంట్నంలో బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అకాడమీ కోసం భూమి పూజచేశారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలో అకాడమీ నిర్మాణానికి కుటుంబసభ్యులతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. ఏడాదిలోపు అకాడమీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని.. తమ స్థలంపై ఎలాంటి వివాదం లేదన్నారు. స్థానికుల అభ్యర్థన మేరకు జూనియర్ కాలేజీని వేరే ప్రదేశంలో కేటాయించాలని మేము ఇప్పటికే ప్రభుత్వానికి సూచించామన్నారు విశాఖలో పెద్ద అకాడమీ ఉండాలనేది తన ఆలోచనని..పేద, ధనిక అనే తేడా లేకుండా ఎవరైనా అకాడమీకి వచ్చి కష్టపడి పైకి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, ఆంధ్రప్రదేశ్‌లో తన పేరుతో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మించేందుకు ప్రారంభించారు. విశాఖపట్నం రూరల్ మండలం చినగదిలి వద్ద పెదగదిలి కూడలి సమీపంలో ప్రభుత్వం కేటాయించిన భూమిలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మించడానికి సింధు తన తల్లిదండ్రులతో కలిసి భూమిపూజ చేశారు. ఆ స్థలంలో భూమిపూజ చేసిన సింధు, పనులు త్వరగా ప్రారంభించి ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. బ్యాడ్మింటన్‌పై ఆసక్తి ఉన్న చిన్నారులు, యువతను మంచి పోటీల్లో ప్రతిభ చూపించేందుకు సిద్ధం చేస్తామన్నారు. అకాడమీ సామర్థ్యం, శిక్షణ విషయాలను త్వరలో వెల్లడిస్తానని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో యువతకు బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పీవీ సింధుకు మూడు ఎకరాల స్థలం కేటాయించింది.అయితే పీవీ సింధుకు కేటాయించిన స్థలాన్ని జూనియర్ కాలేజీకి కేటాయించాలంటూ కొద్దిరోజుల క్రితం స్థానికులు ఆందోళనకు దిగారు. ఇదే సందర్బంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో టీడీపీ నేత ఒమ్మి సన్యాసిరావు స్థానికులతో కలిసి అక్కడ నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ స్కూల్‌కి ఆనుకుని ఉన్న స్థలాన్ని జూనియర్ కాలేజీ నిర్మాణం కోసం కాకుండా బ్యాడ్మింటన్ అకాడమీకి కేటాయించడాన్ని తాము అంగీకరింబోమని స్థానికులు అంటున్నారు. దీనిపై పోరాటం చేస్తామన్నారు.. ఇటీవల నిరన చేశారు. ఈ క్రమలో వీసీ సింధు ఇవాళ అకాడమీ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

పీవీ సింధుకు 2021 జూన్‌లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశాఖపట్నం రూరల్ మండలంలోని చినగదిలి గ్రామంలో రెండు ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమిని బ్యాడ్మింటన్ అకాడమీ మరియు స్పోర్ట్స్ స్కూల్ స్థాపించడానికి ఇచ్చారు. చిగదిలిలో ఉన్న మూడు ఎకరాల స్థలం పశు సంవర్థక శాఖకు చెందినది కాగా.. రెండు ఎకరాలను క్రీడలు, యువజన వ్యవహారాల శాఖకు.. ఒక ఎకరాన్ని వైద్య ఆరోగ్యశాఖకు బదలాయించింది అప్పటి ప్రభుత్వం. రేవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత, క్రీడలు మరియు యువజన వ్యవహారాల శాఖ పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ కోసం రెండు ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పీవీ సింధుకు కేటాయించిన ఈ స్థలానికి సంబంధించిన నిబంధనల ప్రకారం, అకాడమీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మరియు మూడేళ్ల ఐటీ రిటర్న్స్ సమర్పించాలి. ఆ తర్వాతే పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి భూమి అప్పగించారు. ఈ భూమిని కేవలం బ్యాడ్మింటన్ అకాడమీ అవసరాల కోసం మాత్రమే ఉపయోగించాలి. కమర్షియల్ అవసరాల కోసం వాడకూడదు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పుడు అకాడమీ కోసం భూమి పూజ చేశారు. ఇక, స్థానికులు ఈ అంశంపై ఎలా స్పందిస్తారో చూడాలి

Loading