Latest Updates
2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పియూష్ గోయల్

భారతదేశం 2027 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని కేంద్రమంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. మర్చెంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (MCCI) నిర్వహించిన వెబినార్లో మాట్లాడిన ఆయన, భారత ఎకానమీ వేగంగా అభివృద్ధి చెందుతోందని, మరో మూడు సంవత్సరాల్లో $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా నిలవబోతున్నదన్నారు.
ఈ లక్ష్యానికి భారత్ ఇప్పటికే దగ్గరలో ఉందని పియూష్ గోయల్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్@2047’ విజన్ను సాధించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, వ్యాపార వర్గాలు, ప్రజలందరి మద్దతు ఉందని స్పష్టం చేశారు. దేశం సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
![]()
