Business

విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

ఇండిగో విమానాన్ని ఢీకొన్న పక్షి..అత్యవసర ల్యాండింగ్ చేసిన పైలెట్

బిహార్ రాజధాని పట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానానికి విమానాశ్రయం దగ్గరే అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానాన్ని పక్షి ఢీకొనడంతో సాంకేతిక లోపం ఏర్పడింది.

ఈ ఘటనను వెంటనే గుర్తించిన పైలట్లు అప్రమత్తంగా స్పందించి, విమానాన్ని తిరిగి పట్నా విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ సమయంలో విమానంలో మొత్తం 175 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరూ గాయపడకపోవడం, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉండటం ఆందోళనలో ఉన్నవారికి ఊరటను ఇచ్చింది.

ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు విచారణ ప్రారంభించగా, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టినట్టు ఇండిగో సంస్థ వెల్లడించింది. పక్షి ఢీకొనడం వల్ల ఏర్పడే ప్రమాదాలను తగ్గించేందుకు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని విమానయాన నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version