Andhra Pradesh
విజయవాడలో ఘోరం: కరెంట్ షాక్తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
విజయవాడ, మే 24: విజయవాడలోని పటమటలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కరెంట్ షాక్కు గురై విగతజీవులుగా కనిపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, పటమటలోని ఒక ఇంటిలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కరెంట్ షాక్ కారణంగా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. మృతుల గుర్తింపు, ఈ ఘటనకు ఖచ్చితమైన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Continue Reading