Connect with us

Andhra Pradesh

విచారణకు హాజరుకాలేను: అనిల్ కుమార్ యాదవ్

Anil Kumar Yadav | అనీల్ కుమార్ యాద‌వ్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన అంశంపై తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందన వెలువరించారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనపై పోలీసులు నమోదు చేసిన కేసులో విచారణకు హాజరుకాలేదని స్పష్టం చేశారు. తన తరఫు లాయర్ల ద్వారా పోలీసులు ముందస్తుగా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల ప్రస్తుత విచారణకు హాజరుకాలేకపోయినప్పటికీ, తదుపరి తేదీని త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు.

ఈ కేసులో అనిల్ కుమార్ యాదవ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం కోర్టులో ఈ కేసును క్వాష్ చేయాలన్న పిటిషన్ పెండింగ్‌లో ఉండటంతోనే విచారణకు రావడం సాధ్యపడలేదని ఆయన లాయర్లు స్పష్టం చేశారు. కేసు నడుస్తున్న తీరుపై రాజకీయంగా వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. అయితే, విచారణకు సహకరిస్తానన్న అనిల్ వ్యాఖ్యలు ఈ అంశంలో మరింత ఆసక్తికరంగా మారాయి.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *