Connect with us

Sports

వన్డే క్రికెట్‌కు పూర్వ వైభవం: 2028 నుండి సూపర్ లీగ్ పునరుద్ధరణకు ICC కసరత్తులు!

యాభై ఓవర్ల క్రికెట్‌కు (One Day Cricket) పూర్వ వైభవం తీసుకురావాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్ణయించింది. ఇందులో భాగంగా, 2028 సంవత్సరం నుండి ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ లీగ్ పునరుద్ధరణ ద్వారా ముఖ్యంగా చిన్న దేశాలకు ప్రపంచ స్థాయిలో అగ్ర జట్లతో ఆడేందుకు అద్భుతమైన అవకాశం లభించనుంది.

2023 వ‌రల్డ్ కప్ త‌రువాత కఠినమైన షెడ్యూల్ కారణంగా ఈ టోర్నీని నిలిపివేశారు. దీనివల్ల 50 ఓవర్ల ఫార్మాట్ ప్రాధాన్యత కోల్పోకుండా, ద్వైపాక్షిక సిరీస్‌లకు మరింత పోటీ వాతావరణం కల్పించే ఉద్దేశంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ లీగ్ పునరుద్ధరణతో క్రికెట్‌లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు (అసోసియేట్ దేశాలకు) కొత్త శక్తి లభించనుంది. వారు అగ్ర‌శ్రేణి జ‌ట్ల‌తో రెగ్యుల‌ర్‌గా ఆడటం వల్ల ఆటగాళ్ల నైపుణ్యం మెరుగుపడి, వారి దేశాల్లో క్రికెట్ అభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుంది.

మాజీ న్యూజిలాండ్ బ్యాటర్ రోజర్ టూస్ నేతృత్వంలోని ఒక కమిటీ ఈ లీగ్ పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించి ఐసీసీ బోర్డు ముందు ఉంచింది.

గతంలో ఫార్మాట్ (2020-2023):

  • పాల్గొన్న జట్లు: 13 జట్లు.
  • మ్యాచ్‌లు: ప్రతి జట్టు ఇతర ఎనిమిది జట్లతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడింది. మొత్తం 24 వన్డేలు.
  • ప్రాధాన్యత: ఈ లీగ్ ద్వారా సాధించిన పాయింట్ల ఆధారంగానే 2023 వ‌రల్డ్ కప్‌కు జట్ల అర్హత (క్వాలిఫికేషన్) నిర్ణయించబడింది.

ఐసీసీ అధికారులు ఈ పునరుద్ధరణపై సానుకూలంగా ఉన్నారు. “సూపర్ లీగ్ 50 ఓవర్ల ఫార్మాట్‌కు మళ్లీ ప్రాణం పోసే అవకాశం కల్పిస్తుంది. సమస్య ఫార్మాట్‌లో కాదు, దాన్ని ఎలా సుస్థిరంగా నిర్వహించాలన్నదే అసలు ప్రశ్న” అని ఒక ఐసీసీ అధికారి పేర్కొన్నారు.

వన్డే ఫార్మాట్ ఇప్పటికీ ప్రజాదరణ కోల్పోలేదని, దానికి సరైన పోటీ నిర్మాణం (Competitive Structure) కల్పించడంపైనే ఐసీసీ ప్రధానంగా దృష్టి పెట్టింది. పునరుద్ధరించబోయే కొత్త లీగ్‌లో జట్ల సంఖ్యపై ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, ప్రతి జట్టుకు సమాన అవకాశాలు కల్పించడం, పోటీని పెంచడం ప్రాథమిక లక్ష్యంగా ఉంది

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *