International
వందకుపైగా శవాలు.. మైనర్లనూ వదల్లేదు.. ఆ హత్యల వెనుక అసలైన కుట్రదారులు ఎవరు?
పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ఆ ప్రాంతం తాజాగా ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడి భయానక వాంగ్మూలంతో దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గత 20 ఏళ్ల కాలంలో తాను వందకుపైగా శవాలను పాతిపెట్టినట్లు అతను స్వయంగా వెల్లడించాడు. అతని చెప్పిన వివరాల ప్రకారం, ఆ మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారని, కొన్ని శవాలపై లైంగిక దాడుల అంకురాలు కూడా కనిపించేవని పేర్కొన్నాడు.
ఈ విషయాలు వెలుగులోకి రావడంతో అధికార యంత్రాంగం అలెర్ట్ అయ్యింది. ఈ హత్యల వెనుక అసలైన కుట్రదారులు ఎవరు? ఎందుకు మరియు ఎలా ఈ నేరాలు సాగించబడ్డాయి? అన్నదానిపై గాఢంగా దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రంగంలోకి దిగింది.