Andhra Pradesh
లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ కోసం పిటిషన్
ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తరఫున ఆయన న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మిథున్ రెడ్డి నాలుగో నిందితుడిగా (A-4) పేర్కొనబడ్డారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మిథున్ రెడ్డికి జైల్లో కొన్ని అదనపు వసతులు కల్పించాలని కోర్టు ఆదేశించింది.