Connect with us

Latest Updates

లాభాల మాయలో రూ.8 కోట్ల మోసం – గుర్రపు పందేల ముఠా నడిపిన నాయుడు అరెస్టు

మేము చెప్పినట్టు చేయండి అధిక లాభాలు వస్తాయన్నారు - రూ.2.43 కోట్లు కొట్టేశారు

హైదరాబాద్‌లో మరో భారీ మోసానికి తెరలేపింది రాచకొండ పోలీసుల దర్యాప్తు. లాభాల ఆశ చూపిస్తూ జూదపు గుర్రపు పందేల ముఠాను నడిపిస్తున్న నాగేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ కంపెనీలో ఉద్యోగం వదిలేసిన నాగేశ్, ఫుల్ టైం గా పందేలకు బానిసగా మారాడు.

హైదరాబాద్ వచ్చి ‘షైన్వెల్ ఎంటర్‌ప్రైజెస్’ పేరిట వాట్సాప్ గ్రూపుల్లో జూద కార్యకలాపాలు నిర్వహించాడని పోలీసులు తెలిపారు. ట్విన్ సిటీస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 105 మందిని సభ్యులుగా చేర్చుకుని, వేరే లాభాలు వస్తాయన్న నమ్మకంతో మొత్తం రూ.8.34 కోట్లు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ ముఠా ఓన్ చేయబడ్డ గ్రూపుల ద్వారా “తక్కువ పెట్టుబడికి ఎక్కువ రాబడులు వస్తాయి”, “ఇన్సైడర్ సమాచారం ఉంది” అంటూ ప్రజలను ఆకర్షించినట్టు అధికారులు వెల్లడించారు.

వాట్సాప్ లింకులు ద్వారా జూద, పెట్టుబడి గ్రూపులలో చేర్చే యత్నాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లాభాల మాయకు చిక్కకుండా పోలీసులను సంప్రదించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *