Latest Updates
‘రైతు భరోసా’ రాలేదా? – ఆందోళన అవసరం లేదు: మంత్రి తుమ్మల
తెలంగాణలో ‘రైతు భరోసా’ నిధులు తమ ఖాతాల్లో పడలేదని ఆందోళన చెందుతున్న రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశ్వాసం ఇచ్చారు. ఈ విషయంలో తొందరపడి ఆందోళన చెందకూడదని, స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 4 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు ఆయన తెలిపారు.
ఇక జూన్ 5వ తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాస్బుక్లు పొందిన రైతుల దరఖాస్తులను ప్రభుత్వం ఇంకా స్వీకరిస్తోంది. ఈ అప్లికేషన్ గడువు రేపటితో ముగియనుందని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకం లబ్ధి అందేలా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు.