Latest Updates
మేరఠ్ కరెన్సీ ఫెస్టివల్లో నాణేలు, నోట్లు హాట్ కేకులు!
ఇదేమీ బెట్టింగ్ కాదు… ఉత్తరప్రదేశ్లోని మేరఠ్లో నిర్వహిస్తున్న ప్రత్యేక కరెన్సీ ఫెస్టివల్లో పాతకాలం నాటి నాణేలు, నోట్లకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. మొఘల్ మరియు బ్రిటిష్ కాలం నాటి ₹2 నాణెం ఒకటి ఏకంగా ₹3 లక్షలకు విక్రయించబడింది. 50 ఏళ్ల క్రితం ముద్రించిన ₹1000 నోటుకు ₹40,000 ధర పలికింది.
108 ఏళ్ల నాటి రూపాయి నోటు కోసం సైతం కలెక్టర్లు ₹12,000 చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు, ఆంగ్లేయుల కాలం నాటి రూపాయికి ₹5.2 లక్షలు నుంచి ₹5.5 లక్షల వరకు కూడా చెల్లించడానికి చాలా మంది వెనకాడటం లేదు. ప్రాచీన కరెన్సీ ప్రియులకు ఈ ఫెస్టివల్ నిజంగా స్వర్గధామంగా మారింది