Latest Updates
మారిన జీవనశైలికి యోగా అవసరం: మంత్రి దామోదర
గచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, దామోదర రాజనర్సింహతో పాటు సుమారు 5 వేలమంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ, “మారిన జీవనశైలిలో యోగా అవసరమైన సాధన. ఇది ఒత్తిడిని తగ్గించి ధార్మిక దృష్టిని పెంచుతుంది. అన్నిటిలోకెల్లా గొప్ప సాధన యోగానే” అని పేర్కొన్నారు. వేడుకల ముందు యోగాసనాలు నిర్వహించారు.