Andhra Pradesh
మచిలీపట్నంలో రిటైర్డ్ టీచర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు: బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో మైనర్ బాలికపై రిటైర్డ్ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్థానిక హైస్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ)గా పనిచేసి రిటైర్ అయిన నటరాజ్పై బాలిక తల్లిదండ్రులు ఈ ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ ఆరోపణలను నటరాజ్ ఖండించారు. బాలిక తల్లిదండ్రులకు తాను రూ.6 లక్షల అప్పు ఇచ్చానని, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేక తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బాలికను ఉపయోగించి ఉచ్చు వేశారని ఆయన వాదిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.