Connect with us

International

భారత్ తైవాన్‌పై తన స్టాండ్ కొనసాగిస్తోంది

How Would India Respond in a Taiwan Contingency? – The Diplomat

బీజింగ్‌లో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్–చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీతో సమావేశం అనంతరం చైనా అధికారిక మీడియా Xinhua ఒక కీలక వ్యాఖ్యను ప్రచురించింది. తైవాన్ చైనాకే చెందినదని జైశంకర్ పునరుద్ఘాటించారని ఆ మీడియా పేర్కొంది. తైవాన్ అంశంపై భారత్ యొక్క విధానం ఎప్పటిలాగే ఉందని కూడా అదే నివేదికలో ప్రస్తావించారు.

అయితే భారత ప్రభుత్వ వర్గాలు ఈ విషయంపై స్పష్టతనిచ్చాయి. తైవాన్‌పై భారతదేశం యొక్క అధికారిక స్టాండ్‌లో ఎటువంటి మార్పు లేదని, ఇప్పటి వరకు ఉన్న దౌత్య సంబంధాలు కొనసాగుతాయని అవి స్పష్టం చేశాయి. చైనా మీడియా తెలిపిన విషయంపై అధికారిక ప్రకటన భారత ప్రభుత్వంనుంచి వస్తేనే పూర్తి క్లారిటీ వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గత కొంతకాలంగా తైవాన్ అంశం అంతర్జాతీయ రాజకీయాల్లో సున్నితమైనది అవుతోంది. అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో, భారత్‌ వైఖరి కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో జైశంకర్ చేసిన వ్యాఖ్యలను చైనా మాధ్యమాలు విస్తృతంగా హైలైట్ చేయడం గమనార్హం. కానీ భారత్ తైవాన్‌తో ఎటువంటి అధికారిక దౌత్య సంబంధాలు లేవని మళ్లీ గుర్తు చేసింది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *