Connect with us

Latest Updates

భాగ్యనగరంలో ఏసీ బస్సు ప్రయాణం చౌక ధరలకే: 30% ధరల తగ్గింపు!

#టీజీఎస్ఆర్టీసీ #హైదరాబాద్ఆర్టీసీ #బస్సుప్రయాణం #ఏసీబస్సులు #టికెట్ ధరలు #ప్రయాణికులకుగుడ్‌న్యూస్ #హైదరాబాద్న్యూస్ #వేసవిఆఫర్ #ఎలక్ట్రిక్బస్సులు #తెలంగాణరవాణా #గ్రేటర్హైదరాబాద్ #ఆర్టీసీఅప్‌డేట్స్

ఎండలు ముదురుతున్న వేళ హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) బంపర్ ఆఫర్ ప్రకటించింది. నగరంలోని ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ధరలపై 30 శాతం తగ్గింపు ఇవ్వాలని నిర్ణయించింది.

 ఏసీ బస్సు టికెట్ ధరల్లో 30% రాయితీ,గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో మాత్రమే వర్తిం పు,మార్చి 1వ తేదీ నుండి మే నెల చివరి వరకు ఈ తగ్గింపు. మెట్రో ఎక్స్‌ప్రెస్ ధరలకే ఏసీ ప్రయాణం:సాధారణంగా ఏసీ బస్సుల్లో ఛార్జీలు ఎక్కువగా ఉంటాయని భావించే మధ్యతరగతి ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు టికెట్ ధరతోనే ఏసీ బస్సుల్లో హాయిగా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం నగరంలో అందుబాటులో ఉన్న 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో ఈ రాయితీ వర్తించనుంది.

మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో సాధారణ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. టికెట్ కొని ప్రయాణించే వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, వారిని ఏసీ బస్సుల వైపు మళ్లించేందుకు ఈ తగ్గింపు ఎంతగానో ఉపయోగపడనుంది. అదనంగా మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కూడా రోడ్లపైకి తెచ్చేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *