International

పాక్ యాత్రకు నో: మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతి సందర్భంగా SGPC కీలక నిర్ణయం

Operation Shaheen - Pakistan Air Force members targeted by nation-state  attackers - Cyber Defense Magazine

సిక్కు సామ్రాజ్య వ్యవస్థాపకుడు మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతి సందర్భంగా పాకిస్థాన్‌కు ఎలాంటి యాత్రలు నిర్వహించకూడదని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) స్పష్టం చేసింది. ఈనెల జూన్ 29న జరిగే వర్ధంతికి ఏ ఒక్క సిక్కు యాత్రికుడిని పాక్ పంపించబోమని కమిటీ ప్రకటించింది.

ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ వర్గాలు వెల్లడించాయి. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ ప్రాంతాల్లో ఉన్న గురుద్వారాలు, సిక్కు మతపరమైన ప్రదేశాల నిర్వహణను SGPC పర్యవేక్షిస్తుంది. భక్తులు తమ రాష్ట్రాల్లోనే కార్యక్రమాలను నిర్వహించాలంటూ సూచనలు ఇవ్వబడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version