Latest Updates
చైనా విక్టరీ పరేడ్కు సిద్ధం – హాజరుకానున్న ప్రపంచ నేతలు
ద్వితీయ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా రేపు విక్టరీ పరేడ్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ హాజరుకానున్నారు.
అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్తో పాటు ఆసియా, ఆఫ్రికా, యూరప్, లాటిన్ అమెరికా దేశాల నేతలు కూడా పాల్గొననున్నారు.
ఈ వేడుకలో చైనా తన సైనిక శక్తిని ప్రదర్శించనుంది. అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులు, వార్హెడ్లను ప్రజలకు చూపించేందుకు ఏర్పాట్లు చేసింది.