Entertainment
కేసరి చాప్టర్ 2’ ఓటీటీలోకి: జియో హాట్స్టార్లో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్
జలియన్ వాలాబాగ్ మారణకాండ నేపథ్యంలో కోర్టు కథాంశంతో రూపొందిన బాలీవుడ్ చిత్రం ‘కేసరి చాప్టర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్ 13 నుంచి జియో హాట్స్టార్ ప్లాట్ఫామ్లో ప్రసారం కానుంది.
ఈ ఏడాది ఏప్రిల్లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్హిట్గా నిలిచింది. ఈ విజయంతో గత నెలలో తెలుగు ప్రేక్షకుల కోసం కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇటీవలే ఈ చిత్రం 50 రోజుల విజయవంతమైన ప్రదర్శనను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.