Latest Updates
కాళేశ్వరం 3 బ్యారేజీల కథ ముగిసిందా?
తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ను కట్టడానికి సీఎం రేవంత్ చేసిన ప్రకటనతో కాళేశ్వరం ప్రాంతంలోని 3 బ్యారేజీల భవిష్యత్తు అనిశ్చితిలో పడినట్లుంది.
మేడిగడ్డ బ్యారేజీ ఇప్పటికే కుంగిపోయి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కూడా ముప్పు ఉందని ప్రభుత్వం తెలిపింది. ఈ 3 బ్యారేజీల పని లేకుండా తుమ్మిడిహట్టి బ్యారేజీ ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించే యోచన జరుగుతోంది.
ప్రాజెక్ట్లో మధ్యలో ఒక లిఫ్ట్ ద్వారా నీళ్లు తరలిస్తారని, గ్రావిటీతో నీళ్లు వస్తాయని ప్రభుత్వం స్పష్టంచేసింది.