Connect with us

Latest Updates

కాళేశ్వరం కేసు CBIకి

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు నిర్ణయం.. సీఎం రేవంత్‌ సంచలన ప్రకటన |  Decision for CBI inquiry into Kaleshwaram project.. CM Revanth's  sensational statement

కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న భారీ అవినీతి వ్యవహారంపై ఇప్పుడు సీబీఐ దర్యాప్తు జరగనుంది. ఈ కేసు బదలాయింపుతో తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కాళేశ్వరం కుంభకోణంలో బీఆర్‌ఎస్ కీలక పాత్ర వహించిందని ఆరోపణలు వస్తున్న వేళ, ఈ కేసు సీబీఐ దర్యాప్తుకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

బండి సంజయ్ విమర్శలు
ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ బీఆర్‌ఎస్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. “కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అంతా బీఆర్‌ఎస్ పాలనలోనే జరిగింది. మేము మొదటి నుంచే సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాం. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీన్ని ఆలస్యం చేసింది. ఇప్పుడు సత్యం ఎదుట తలవంచి కేసును సీబీఐకి అప్పగించాల్సి వచ్చింది” అని వ్యాఖ్యానించారు.

ఇతర కేసుల ప్రస్తావన
ఇక ORR టోల్ టెండర్లపై SIT ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదని బండి సంజయ్ విమర్శించారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా ప్రభుత్వం సీరియల్లా సాగిస్తోందని ఎద్దేవా చేశారు. మొత్తంగా, కాళేశ్వరం కేసు సీబీఐ దర్యాప్తుకు రావడంతో, అవినీతి ఆరోపణలపై నిజానిజాలు వెలుగులోకి రానున్నాయని ఆయన పేర్కొన్నారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *