Connect with us

Latest Updates

ఓట్ చోరీని మరిపించేందుకు బీజేపీ కొత్త ప్లాన్: CM స్టాలిన్

ఎన్నికల సమయంలోనే బీజేపీ ప్రజల పట్ల శ్రద్ధ చూపుతుంది: సీఎం స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓటు చోరీ వ్యవహారంపై ప్రజల దృష్టి మరల్చేందుకు కేంద్రం 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తెరపైకి తెచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ బిల్లుతో బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవాలనుకుంటోందని, ప్రజాస్వామ్య విలువలను పక్కనబెడుతోందని మండిపడ్డారు.

“కక్ష సాధింపులో భాగమే” – స్టాలిన్ వ్యాఖ్య

రాజ్యాంగ సవరణ బిల్లు అసలు ఉద్దేశం రాజకీయ ప్రత్యర్థులపై దాడి చేయడమేనని స్టాలిన్ స్పష్టం చేశారు. “ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థి నాయకులను చట్టపరమైన ఆధారాలు లేకుండా టార్గెట్ చేయడం అనేది తగదు. ఒక సీఎంను 30 రోజులు అరెస్ట్ చేసి ఎలాంటి విచారణ లేకుండా ఉంచడం ప్రజాస్వామ్యానికి అవమానం” అని విమర్శించారు. ఇది బీజేపీ నడుపుతున్న “డిక్టేటర్షిప్ పాలన”కు ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యం రక్షణపై పిలుపు

తమిళనాడు ప్రజలను, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులను బీజేపీ చర్యలకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి రావాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. రాజకీయ కక్ష సాధింపులు ఎంతకాలం కొనసాగినా ప్రజలు చివరికి నిజాన్ని గుర్తిస్తారని, కేంద్రం ఎలాంటి ఒత్తిడి తెచ్చినా తమ రాష్ట్రంలో బీజేపీ అజెండా నెరవేరదని ఆయన ధైర్యంగా ప్రకటించారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *