National
ఐపీఎల్ 2025: ఆర్సీబీ ట్రోఫీ గెలుస్తుందని ChatGPT జోస్యం
ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్ను ఓడించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫైనల్కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025 విజేత ఎవరనే ప్రశ్నపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనం అయిన ChatGPTని సంప్రదించగా, ట్రోఫీ ఆర్సీబీ చేతుల్లోకి వెళ్తుందని జోస్యం చెప్పింది.
ఈ సీజన్లో ఆర్సీబీ ఆటగాళ్ల ఫామ్, స్థిరమైన ప్రదర్శనలను కొలమానంగా తీసుకుని ChatGPT ఈ అంచనా వేసింది. ఆర్సీబీ జట్టు ఈ సీజన్లో అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్కు చేరుకోవడం, వారి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతుల్యతను కనబర్చడం ఈ ప్రిడిక్షన్కు బలమైన కారణాలుగా చెప్పవచ్చు.
మరోవైపు, ముంబై ఇండియన్స్ (MI) జట్టు పదేపదే ఆటగాళ్లను మార్చడం వల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని, అలాగే గుజరాత్ టైటాన్స్ (GT) జట్టులో కీలక ఆటగాళ్లు లేకపోవడం వారి విజయావకాశాలను దెబ్బతీస్తుందని ChatGPT విశ్లేషించింది.
ఈ సీజన్లో ఆర్సీబీ జట్టు అసాధారణ ప్రదర్శనతో అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. 18 ఏళ్ల తమ ట్రోఫీ కలను సాకారం చేసుకునేందుకు ఆర్సీబీ సిద్ధంగా ఉందని, ఈ జోస్యం నిజమవుతుందా అనేది ఫైనల్ మ్యాచ్లో తేలనుంది.