Connect with us

Latest Updates

ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు!

Telangana : పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు | telangana legislative  assembly speaker gaddam prasada rao has decided to issue notices to ten  mlas who have changed parties

హైదరాబాద్‌: పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు ఆదేశాలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపే పరిణామాలు జరుగుతున్నాయి. BRS నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ యాక్షన్ మొదలుపెట్టారు. తాజాగా ఐదుగురు ఎమ్మెల్యేలకు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. మిగతా ఎమ్మెల్యేలపై కూడా దశలవారీగా చర్యలు తీసుకునే అవకాశముందని స్పీకర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో BRS టికెట్‌పై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన విషయం తెలిసిందే. దీంతో వారిని అనర్హులుగా ప్రకటించాలని BRS శాసనసభలో డిమాండ్ చేస్తోంది. అయితే తాము అధికారికంగా పార్టీ మార్చలేదని, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మాత్రమే కాంగ్రెస్‌తో ఉన్నామని కొందరు ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు.

ఈ పరిణామాలతో రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. స్పీకర్ విచారణ ప్రక్రియ పూర్తయ్యేలోపు రెండు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రతిఆరోపణలు మరింత వేగం పుంజే అవకాశం ఉంది. ముఖ్యంగా సుప్రీం కోర్టు నిర్దేశించిన మూడు నెలల గడువులోనే తుది నిర్ణయం వెలువడనుండటంతో ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *