International

“ఏం చేసినా నాకు నోబెల్ రాదు!” – ట్రంప్

యుద్ధం' ఆపితే నోబెల్‌ రాదు: ట్రంప్‌ అదే 'మధ్యవర్తిత్వ' వాదనలు | Wont Get  Nobel Prize For Stopping India Pakistan War...": Donald Trump Again Claims  Credit For Ind-pak Ceasefire | Sakshi

అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన స్టైల్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతి కోసం తాను చేసిన కృషిపై మాట్లాడుతూనే.. అందుకు గానూ నోబెల్ బహుమతి తానేంటా అందుకుంటానని శ్రద్ధ లేదన్నాడు. “ఏం చేసినా నాకు నోబెల్ రాదు” అంటూ ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు.

“ఇప్పుడే ఒక గొప్ప పనిని చేశాం. ఆఫ్రికా ఖండంలో చాలా ఏళ్లుగా గొడవలు పడుతున్న కాంగో-రువాండా దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చాం. ఇది ఆఫ్రికా కోసం చారిత్రకమైన రోజు,” అని ట్రంప్ చెప్పారు.

అక్కడితో ఆగలేదు ఆయన. “భారత్-పాకిస్థాన్ మధ్య శాంతి కుదిర్చినా, సెర్బియా-కొసోవో మధ్య సమస్యలు పరిష్కరించినా, ఈజిప్ట్-ఇథియోపియా జలవివాదం తీర్చినా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపినా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య శాంతి తీసుకొచ్చినా… అయినా నన్నెవ్వరూ నోబెల్ కోసం పరిశీలించరు. మిడిల్ ఈస్ట్‌లో శాంతి నెలకొల్పినా నన్ను గుర్తించరు,” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

అంతేకాదు — “ఈ బహుమతులు ఎవరిది అనే కంటే నిజంగా ప్రజల కోసం చేసిన పనికి విలువ ఉంటుంది. ప్రజలు ఏది నిజమో తెలుసుకుంటారు. అదే నాకు చాలు,” అంటూ తనదైన శైలిలో ముగించారు.

ప్రపంచ నాయకుల్లో అసహనాన్ని బహిరంగంగా వ్యక్తం చేసే కొద్దిమందిలో ట్రంప్ ఒకరు. తనపై అన్యాయం జరుగుతోందన్న భావన ఆయనను తరచూ ఇలా మాట్లాడేలా చేస్తోంది. అయినా సరే.. ట్రంప్ మాటల్లో కొంత నిజం ఉందనేది కొందరి అభిప్రాయం. రాజకీయ లబ్దిగానే బహుమతులు వస్తాయా? లేదా నిజంగా శాంతికి కృషి చేసిన వారికి వస్తాయా? అనే చర్చ మరోసారి మొదలైంది.

అంతేకాదు.. ప్రపంచ రాజకీయాల్లో నోబెల్ ప్రైజ్ అన్నది ఒక్కోసారి ప్రశ్నార్థకంగా మారుతుందని ట్రంప్ సూచించినట్టుగా ఈ వ్యాఖ్యల వెనుక దాగి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version