International

ఆ వార్తల్లో నిజం లేదు: BCCI

IPL 2025: విదేశీ ఆటగాళ్లు తిరిగొస్తారు.. ఐపీఎల్ కొనసాగుతుంది : బీసీసీఐ  ఛైర్మన్

ఆసియా కప్ టోర్నమెంట్ నుంచి భారత క్రికెట్ జట్టు తప్పుకుంటుందన్న వార్తలు గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఆసియా కప్ గురించి బోర్డు ఎటువంటి చర్చ జరపలేదని ఆయన స్పష్టం చేశారు.

ఇంకా, ఆసియన్ క్రికెట్ కౌన్సిల్‌కు బీసీసీఐ ఎలాంటి లేఖ రాయలేదని, ప్రస్తుతం తమ దృష్టి మొత్తం ఐపీఎల్ మరియు ఇంగ్లండ్‌తో జరిగే క్రికెట్ సిరీస్‌పైనే ఉందని దేవజిత్ సైకియా తెలిపారు. ఈ వివరణతో ఆసియా కప్ గురించి వచ్చిన పుకార్లకు బీసీసీఐ చెక్ పెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version