Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ దిశగా అడుగులు: అమరావతిలో సమ్మిట్‌కు చంద్రబాబు హాజరు

AP News: తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్.. 2,000 ఉద్యోగాలు గ్యారెంటీ,  సీఎం ప్రకటన.. | CM Chandrababu inaugurated Green Hydrogen Project in  Tirupati, Know details - Telugu Goodreturns

పర్యావరణ పరిరక్షణకు కీలకమైన గ్రీన్ ఎనర్జీ రంగంలో మరింత ముందుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర రాజధాని అమరావతిలో నేడు గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌ జరగనుండగా, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లతో పాటు పలు దేశీయ, అంతర్జాతీయ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొననున్నారు. పునరుత్పాదక శక్తి వనరుల వినియోగం, పరిశ్రమల అభివృద్ధి, కాలుష్య నియంత్రణ వంటి అంశాలపై సమ్మిట్‌లో విశ్లేషణ జరగనుంది.

ఈ సమ్మిట్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. దీని ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు రాగలవని, పరిశ్రమల స్థాపనతో పాటు ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా పునరుత్పాదక విద్యుత్ ఆధారిత హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, పంపిణీ వ్యవస్థలపై విధివిధానాలు రూపొందించనున్న ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలకు ఆకర్షణీయంగా పాలసీలు ప్రకటించే అవకాశముంది. పరిశుభ్రమైన శక్తి వనరుల ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించే దిశగా ఈ సమ్మిట్ రాష్ట్రానికి కీలక మలుపుగా మారనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version