Andhra Pradesh
అనంతపురంలో కూటమి తొలి బహిరంగ సభ
అనంతపురం జిల్లాలో ఈరోజు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” పేరుతో జరుగుతున్న ఈ సభపై ఇప్పటికే ప్రజల్లో విశేష ఆసక్తి నెలకొంది. అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి కలిసి నిర్వహిస్తున్న ఇదే మొదటి పెద్దస్థాయి సభ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి అనంతపురంపై కేంద్రీకృతమైంది.
15 నెలల పాలనపై నివేదిక
ఈ సభలో ముఖ్య నేతలు వేదికపైకి వచ్చి గత 15 నెలలుగా కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాల గురించి ప్రజలకు వివరించనున్నారు. అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగావకాశాలు వంటి అంశాలపై ముఖ్యంగా చర్చించనున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో చేపట్టబోయే ప్రాజెక్టులు, పథకాలపై కూడా దిశానిర్దేశం ఇవ్వనున్నట్లు సమాచారం.
లైవ్ ప్రసారం సదుపాయం
ప్రజలు ఈ సభను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కూడా కల్పించారు. ఆసక్తి గల వారు పైనున్న బటన్పై క్లిక్ చేసి సభను లైవ్లో చూడవచ్చు. ఈ కార్యక్రమానికి ప్రాంతీయ ప్రజలతో పాటు రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దీంతో అనంతపురం రాజకీయ చైతన్యానికి కేంద్రబిందువుగా మారింది.