Andhra Pradesh

హైవేలో చిన్న క్లిక్‌తో రూ.1000 రివార్డ్ – NHAI వినూత్న పథకం వాహనదారుల కోసం

దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజాల వద్ద టాయిలెట్ల పరిశుభ్రత కోసం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) వినూత్న చర్యలు చేపట్టింది. హైవేలో ప్రయాణించే వాహనదారులు టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తిస్తే ఫోటో తీసి రాజ్ మార్గ్ యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. అలా చేసిన వారికి ఫాస్టాగ్ అకౌంట్‌లో రూ.1000 రివార్డ్ పాయింట్లు జమ చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడమే NHAI ప్రధాన లక్ష్యం.

ఈ రివార్డ్ స్కీమ్‌ అక్టోబర్ 31వ తేదీ వరకే కొనసాగుతుంది. వాహనదారులు తమ మొబైల్‌లో రాజ్ మార్గ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, అపరిశుభ్ర టాయిలెట్ ఫోటోలను అప్‌లోడ్ చేయాలి. ఫోటోతో పాటు వాహనం నంబర్, లొకేషన్, ఫోన్ నంబర్ వంటి వివరాలు కూడా ఇవ్వాలి. అర్హమైన ఫోటోలను ఎంపిక చేసిన తర్వాత NHAI అధికారులు సంబంధిత ఫాస్టాగ్ అకౌంట్‌లకు రూ.1000 రీఛార్జ్ జమ చేస్తారు.

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ వాహనదారుల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ చర్య చేపట్టింది. టాయిలెట్లు మాత్రమే కాకుండా, టోల్ ప్లాజాల వద్ద అందుబాటులో ఉండే ఇతర సదుపాయాల నాణ్యతను కూడా పర్యవేక్షించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఇది పబ్లిక్ పార్టిసిపేషన్‌ ఆధారిత క్లీన్లినెస్ ఇనిషియేటివ్‌గా నిలుస్తోంది.

అంతేకాదు, NHAI ఫాస్టాగ్‌ యాన్యువల్ టోల్ పాస్‌ను గిఫ్ట్‌గా ఇవ్వగల సౌకర్యాన్ని కూడా ప్రారంభించింది. రాజ్ మార్గ్ యాప్‌లోని “Add Pass” సెక్షన్ ద్వారా వాహన నంబర్, ఫోన్ నంబర్ వంటి వివరాలు ఇచ్చి ఎవరికైనా వార్షిక టోల్ పాస్ బహుమతిగా అందించవచ్చు. ఈ కొత్త ఫీచర్ వాహనదారుల మధ్య సౌకర్యవంతమైన డిజిటల్ టోల్‌ సిస్టమ్‌ను మరింత ప్రోత్సహించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version