Business

మార్కెట్ల జైత్రయాత్ర: యుద్ధ భయాల నడుమ 900 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. ఇన్వెస్టర్ల సంపదకు రూ.6 లక్షల కోట్ల జోడింపు!

గడిచిన కొన్ని రోజులుగా భారీ నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, మార్చి 5వ తేదీన అద్భుతమైన రికవరీని సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, యుద్ధం త్వరలోనే ముగియవచ్చన్న ఆశలు మార్కెట్ సెంటిమెంటును బలపరిచాయి.

సెన్సెక్స్ & నిఫ్టీ: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 900 పాయింట్లు లాభపడి 80,015 వద్ద ముగియగా, నిఫ్టీ 285 పాయింట్ల వృద్ధితో 24,765 వద్ద స్థిరపడింది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ ఏకంగా 1100 పాయింట్లు లాభపడటం విశేషం,మార్కెట్లు పుంజుకోవడంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజే రూ. 6 లక్షల కోట్లు పెరిగి, మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 453 లక్షల కోట్లకు చేరింది,అదానీ పోర్ట్స్, రిలయన్స్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ వంటి భారీ వెయిటేజీ షేర్లు 4 శాతం వరకు లాభపడి మార్కెట్‌కు వెన్నుముకగా నిలిచాయి.

తన అణు కార్యక్రమాన్ని (Nuclear Program) నిలిపివేసేందుకు ఇరాన్ మొగ్గు చూపుతోందన్న వార్తలు, అమెరికా ఏజెన్సీలతో చర్చలకు సిద్ధమవ్వడం మార్కెట్లకు ఊపిరినిచ్చాయి, హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే చమురు నౌకలకు అమెరికా నౌకాదళం రక్షణ కల్పిస్తుందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ఇన్వెస్టర్లలో ధైర్యాన్ని నింపింది.డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 92 స్థాయి నుండి 91.60కి బలపడటం సానుకూలాంశంగా మారింది.జపాన్, చైనా మరియు దక్షిణ కొరియా మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడం మన సూచీలపై సానుకూల ప్రభావం చూపింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version